ఇస్లామాబాద్ : అమెరికాకు చెందిన బలగాలను ఆపరేట్ చేయడానికి అనుమతించొద్దని ఆఫ్ఘనిస్తాన్ పొరుగుదేశాలను తాలిబాన్ ఉగ్రవాదులు హెచ్చరించారు. అలా వారికి అనుమతించడం చాలా పెద్ద తప్పవుతుందని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి రప్పించడం ప్రారంభమైన నేపథ్యంలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు తాలిబాన్ ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాము పూర్తిగా ఆఫ్ఘాన్ నుంచి వైదొలగడం లేదని, ఆఫ్ఘాన్పై తమ కన్నుంటుందని అమెరికా ప్రకటన చేసిన మరునాడే తాలిబాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాలకు హెచ్చరికలు పంపారు. తమ బలగాలను ఆపరేట్ చేసేందుకు అమెరికాకు స్థలం ఇవ్వొద్దని వారు హెచ్చరిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాలిబాన్తో జరిగిన ఒప్పందం మేరకు అమెరికా తన సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెప్టెంబర్ 11 లోగా పూర్తిగా ఉపసంహరించుకునే ప్రయత్నంలో ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ మిత్రదేశాలు, దగ్గరి దేశాలతో అమెరికా నిరంతరం సన్నిహితంగా ఉంటున్నది. ఇదే సమయంలో, భారతదేశం వంటి దేశాలు తాలిబాన్ ఉనికి గురించి భయపడుతున్నాయి. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా వీరి గురించి భయం వ్యక్తం చేస్తున్నది.
తాలిబాన్ ప్రకటన కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పాకిస్తాన్ తన సైనిక స్థావరాన్ని నిర్మించడానికి, తన గగనతలాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇచ్చిందని అమెరికా ఇటీవల స్పష్టం చేసింది. అమెరికా దళాలకు పాకిస్తాన్ భూ సహాయాన్ని అందిస్తుండటం తాలిబాన్కు నచ్చడం లేదు. అమెరికా ప్రకటన వచ్చిన మరుసటి రోజునే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా ఇచ్చిన ఈ ప్రకటన పూర్తిగా నిరాధారమైనదని, అబద్ధమని ఖండించింది. ఇలాంటి ముసాయిదా తమ ప్రభుత్వానికి రాలేదని, దీనిపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరుగడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. తమ భూభాగాన్నిఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్ అనుమతించదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి బుధవారం స్పష్టం చేశారు.
హాంకాంగ్లో ఊరేగింపులపై కఠిన నిషేధం
ఫ్రిడ్జ్, మాస్క్లతో బ్లాక్ ఫంగస్ దాడి
రోజు కోటి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేందుకు సన్నాహాలు: డాక్టర్ వీకే పాల్
సంకీర్ణ ధర్మం పాటించకపోతే మద్దతు ఉపసంహరణ : ఠాక్రేకు కాంగ్రెస్ బెదిరింపు
కొవిడ్ పాజిటివ్ శిశువుకు జన్మనిచ్చిన నెగెటివ్ తల్లి
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..