దోహా: భారత స్టార్ ప్యాడ్లర్లు శరత్ కమల్, మనికా బాత్రా టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా క్వాలిఫికేషన్ టోర్నీ ఫైనల్లో శరత్-మనికా జోడీ 8-11, 6-11, 11-5, 11-6, 13-11, 11-8 తేడాతో కొరియా ద్వయం సంగ్సూ లీ, జీ జియోన్పై ఉత్కంఠ విజయం సాధించి విశ్వక్రీడల టికెట్ దక్కించుకుంది. కాగా సింగిల్స్ విభాగంలో శరత్ కమల్, సాతియాన్, మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.