పుణె: టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మణికా బాత్రా కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నది. పుణెలోని కమలా నెహ్రూ హాస్పిటల్లో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న అథ్లెట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లో ఆమె వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మణికా బాత్రా మాట్లాడుతూ.. వచ్చే టోక్యో తాను శక్తివంచన లేకుండా వంద శాతం ప్రదర్శన ఇస్తానని చెప్పారు.