మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్లో భారత పేస్ దళం బాధ్యతలు వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకే దక్కాయి. గాయంతో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ మెగాటోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారా? అని కొనసాగుతున్న ఉత్కంఠకు బీసీసీఐ తెరదించింది.
బుమ్రా స్థానంలో షమీని జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన షమీ.. కోలుకొని ఆస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగే వార్మప్ మ్యాచ్ల సమయానికి అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది. అతనితోపాటు రిజర్వ్ ఆటగాళ్లుగా హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ను కూడా ఎంపిక చేశామని, వీళ్లిద్దరూ త్వరలోనే ఆస్ట్రేలియా పయనం అవుతారని వెల్లడించింది.
పొట్టి ప్రపంచకప్లో భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ