మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్కు అంతా రెఢీ అయ్యింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఆ టోర్నీలో సూపర్12 స్టేజ్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్లో ఆసీస్, కివీస్ తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 23న జరిగే దాయాది సమరంలో ఇండియా, పాక్ పోటీపడనున్నాయి. అయితే ఇవాళ టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లకు చెందిన కెప్టెన్లతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కెప్టెన్స్ డే పేరుతో జరిగిన ఈవెంట్లో ఆ కెప్టెన్లు అంతా మీడియాతో మాట్లాడారు. 16 జట్లకు చెందిన కెప్టెన్లు దిగిన ఫోటోను ఐసీసీ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ తీసిన సెల్ఫీ ఫోటోను కడా ఐసీసీ ట్వీట్ చేసింది.
Selfie time 😁🤳#T20WorldCup pic.twitter.com/snMOzdPMq3
— ICC (@ICC) October 15, 2022
నవంబర్ 13వ తేదీన టీ20 వరల్డ్కప్ ఫైనల్ జరగనున్నది. ఆ ఫైనల్లో గెలిచిన జట్టు 1.6 మిలియన్ల డాలర్లు సొంతం చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికాలు తమ మ్యాచ్లను సూపర్ 12 స్టేజ్ నుంచి ప్రారంభించనున్నాయి.
ఫస్ట్ రౌండ్లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి.
All the 16 captains in one frame 📸 🤩#NewCoverPic | #T20WorldCup pic.twitter.com/WJXtu0JEvx
— ICC (@ICC) October 15, 2022
కెప్టెన్స్ డే మీట్లో ఓ అరుదైన ఘటన జరిగింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ తెచ్చిన కేక్ను బాబర్ కట్ చేశాడు. టోర్నీలో పాల్గొంటున్న మరో 15 మంది జట్ల కెప్టెన్లతో బాబర్ తన పుట్టినరోజును జరుపుకోవడం విశేషం.
Happy birthday @babarazam258 🎂
That cake looks good! 😋#T20WorldCup pic.twitter.com/JFNeBLoVg5
— ICC (@ICC) October 15, 2022