మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్ సూపర్-12లో శ్రీలంక-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్పై శ్రీలంక ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ 43 బంతుల్లో అజేయంగా 68 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఐర్లాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. లంక బౌలర్ల ధాటికి బేరింగ్ హ్యారీ టెక్టార్, పాల్ స్టిర్లింగ్ మినహా మరే ఐర్లాండ్ బ్యాటర్ కూడా ఎదురు నిలువలేకపోయారు.
దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. టెక్టార్ 42 బంతుల్లో 45 పరుగులు, స్టిర్లింగ్ 25 బంతుల్లో 34 పరుగులు మాత్రమే రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, వనిందు హసరంగా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్య చేధన కోసం బరిలో దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు కుశాల్ మెండిస్, చరిత్ అసలంక శుభారంభాన్నిచ్చారు.
మెండిస్ 68, అసలంక 31, ధనంజయ 31 పరుగులు చేయడంతో శ్రీలంక 15 ఓవర్లలో కేవలం ఒకే వికెట్ నష్టపోయి 133 పరుగులు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.