గీలాంగ్ (ఆస్ట్రేలియా): యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్.. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించి రికార్డుల్లో నిలిచాడు. ఈ టీ20 ప్రపంచకప్లో ఇదే తొలి హ్యాట్రిక్. కాగా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఐదో బౌలర్గా మెయ్యప్పన్ రికార్డుకెక్కాడు. మెయ్యప్పన్ కంటే ముందు బ్రెట్ లీ, క్యాంఫర్, వనిందు హసరంగా, కాగిసో రబడా హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.
అయితే, మెయ్యప్పన్ హ్యాట్రిక్ వికెట్లు తీసినా శ్రీలంక చేతిలో యూఏఈ జట్టుకు ఓటమి తప్పలేదు. 79 పరుగుల తేడాతో యూఏఈ ఘోరపరాజయం మూటగట్టుకుంది. ముందుగా యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా వచ్చిన పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ శ్రీలంకకు శుభారంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ ముగిసే సరికి లంక జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
ఆ తర్వాత 153 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఏఈ టాప్ ఆర్డర్ను శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా దెబ్బతీశాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి యూఏఈ 4 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ఆఖరికి 73 పరుగలకే ఆలౌటై 79 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. 19 పరుగులు చేసిన ఆయాన్ ఆఫ్జల్ ఖాన్ యూఏఈ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.