తెలంగాణ ఉద్యమంలో మన అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడానికి సురవరం రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఎత్తిపట్టాం. సారస్వత పరిషత్ అందించిన గ్రంథాలెన్నో ఉద్యమానికి ఉత్ప్రేరకంలా పనిచేశాయి. భాషాభిమానం పెంచే సారస్వత పరిషత్ పుట్టుక కూడా భాషాభిమానం నుంచి పుట్టుకొచ్చినదే. తెలుగుకు ఆదరణే లేని కాలంలో.. తెలుగులో మాట్లాడితే గౌరవం దక్కని రోజుల్లో… తెలుగుని వెలిగించేందుకు నడుంకట్టిన సారస్వత పరిషత్ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపుకొని తెలుగు భాషా కీర్తిని నేటికీ చాటుతున్నది. పదో ఆంధ్ర మహాసభలు హైదరాబాద్ (రెడ్డి హాస్టల్)లో జరిగాయి. ఈ సభద్వారా భాషాభివద్ధికి పాటుపడే అవకాశాలు లేవని భావించి, ఆ మహాసభలోనే వేరొక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు భాస్కరభట్ల కష్ణారావు, బూర్గుల రామకష్ణారావు, లోకనంది శంకరనారాయణ రావు, బుక్కపట్నం రామానుజాచారి, కాళోజీ నారాయణరావు.
మొత్తం 19 మంది సభ్యులు కలిసి తెలుగు వాళ్లలో మాతృభాషాభిమానం పెంచడం, భాషా వ్యాప్తికి పాటుపడడం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రకారం 1943 మే 26న ‘నిజాం రాష్ర్ట ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం ‘ఆంధ్ర సారస్వత పరిషత్’గా మార్చారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావంతో ‘తెలంగాణ సారస్వత పరిషత్’గా నేటికీ భాషాభిమానం పెంచుతూ, తెలుగు సాహితీ వైభవాన్ని చాటుతున్నది.