గజ్వేల్/హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 23 : స్వచ్ఛసర్వేక్షణ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ 2022 సంవత్సరానికి గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు అవార్డులు లభించాయి. ఈ మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ కార్యదర్శి రూపామిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రెండు మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలోని మరో 14 మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా మున్సిపల్ చైర్పర్సన్లు అవార్డులు అందుకోనున్నారు.