తిరుమల, మే 27: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ పిఎస్.జయరాఘవేంద్ర ఈ మేరకు విరాళం అందించారు. దాత తరఫున టిటిడి బోర్డు సభ్యులు డిపి.అనంత ఈ మేరకు విరాళం డిడిని టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి తిరుమలలోని వారి బంగళాలో అందజేశారు.