కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువెందు అధికారి పోటీ చేయనున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆమెతో తలపడనున్నారు. ఈ మేరకు 57 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. మార్చి 27న జరుగనున్న తొలి దశ, ఏప్రిల్ 2న జరుగనున్న రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు 57 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిందని మీడియాకు తెలిపారు. ఇందులో భాగ్ముండి సీటును ఏజేఎస్యూకు కేటాయించినట్లు వివరించారు.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరుగనున్నాయి. దీనితోపాటు అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి జరిగే ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.