ముంబై: ఒక కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక కుటుంబంలోని ఆరుగురు మధ్యప్రదేశ్లోని నందగౌముల్క్ నుంచి మహారాష్ట్రలోని ముల్తాయ్కు స్కార్పియోలో వెళ్తున్నారు.
అయితే కారు డ్రైవర్ లీలాధర్ హివారే తప్పుడు నిర్ణయంతో వారు ముప్పులోపడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు కెల్వాడ్ వద్ద వరదలు పోటెత్తుతున్న నందా కాలువపై తక్కువ ఎత్తులో ఉన్న వంతెనను దాటేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో ఆ కారు కొట్టుకుపోయింది. సహాయం కోసం అందులోని వారు కేకలు వేసినా ఫలితం లేకపోయింది.
కాగా, ఇది చూసిన కొందరు స్థానికులు ఏమీ చేయలేకపోయారు. మరి కొందరు కొట్టుకుపోతున్న కారును తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పదేళ్ల బాలుడు, ఒక మహిళ, ఒక పురుషుడి మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
#Maharashtra | A Scorpio with passengers was washed away in #flood water in #Nagpur.
The incident occurred at 2 pm today, near Savner where water was filled. The driver tried to get the Scorpio out of the water-filled culvert but the flow was too strong. pic.twitter.com/EZluG3djHo
— Mirror Now (@MirrorNow) July 12, 2022