తిరుపతి : ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడని అనే సూక్తి’ ఇక్కడ వందకు వందశాతం నిజమైంది. ఎన్నో బాధలు, మరెన్నో కోరికలతో ఆలయాలకు వచ్చి దేవుళ్లను మొక్కుకునే భక్తులు ఆలయ అర్చకులు, సిబ్బంది చేతివాటంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఆలయ సిబ్బంది నిర్వాకంతో ఇబ్బందులు పడుతు న్న భక్తులు వీడియోను చిత్రీకరించి పంపడంతో మొత్తం ఐదుగురిపై వేటు వేస్తు నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు అర్చకులను అధికారులు సస్పెన్షన్, మరో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. భక్తుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న డబ్బులు అడుగుతున్న దృశ్యాలను కొందరు భక్తులు చిత్రీకరించి అధికారులకు పంపారు. వీటిని పరిశీలించిన అధికారులు వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.
,