శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి అనుమానిత డ్రోన్లు సంచరించాయి. ఈ మేరకు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ తెలిపారు. ఇంతకు ముందు ఆదివారం రాత్రి సైతం జిల్లాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలో నాలుగు ప్రదేశాల్లో డ్రోన్ల కదలికలను గుర్తించారు. శుక్రవారం సైతం జిల్లాలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో డ్రోన్లు సంచరించాయి. గత నెలలో జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరగడంతో ఎన్ఎస్జీ నగరంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించింది. జమ్మూతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ముఖ్యమైన ఎయిర్బేస్లలో డ్రోన్ దాడులు జరుగకుండా ఎయిర్ ఫోర్స్ చర్యలు చేపట్టింది.