తుర్కపల్లి, అక్టోబర్ 26 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.3.5లక్షల విలువైన చెక్కులను మంగళవారం మండలంలోని రాంపురంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
తుర్కపల్లి, అక్టోబర్ 26 : మండలంలోని రాంపురంలో మంగళవారం రేణుకా ఎల్లమ్మ, దుర్గమ్మ ఆలయాల్లో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, సర్పంచ్ మంజులామహేందర్, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ పరమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దునాయక్, ఎంపీటీసీలు పలుగుల నవీన్కుమార్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్గౌడ్, నాయకులు బూక్యా రవీందర్, తలారి శ్రీనివాస్, భాస్కర్నాయక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.