చివ్వెంల, అక్టోబర్ 23 : హైదరాబాద్లోని స్లేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శనివారం ఉండ్రుగొండ గుట్టలో సందడి చేశారు. 50 బస్సుల్లో సుమారు 1200 మందికి పైగా చిన్నారులు విహారయాత్రలో భాగంగా వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా చిన్నారులే కనిపించారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. టీచర్లు సైతం ఆనందం వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అంత్యాక్షరి, పాటల పోటీలు నిర్వహించుకున్నారు. సుమారు 5 గంటలపాటు ఇక్కడే గడిపారు.