కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు
ఆలోచించుకుని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
హాలియా, తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 11: ‘నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక వైపు అభివృద్ధి పనులు, ఇంకో వైపు ప్రజలు ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ పరిస్థితి లేదు.. రైతులు కరెంటు కోసం పడిగాపులు కాస్తే.. ఆడబిడ్డలు తాగునీళ్ల కోసం బిందె పట్టుకొని ఎదురుచూశారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారమైనయి.. ఒక్క ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఎవరి వల్ల మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయండి. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించండి.. నెల్లికల్లు ఎత్తిపోతలను పూర్తి చేయించే బాధ్యత నాది’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్లు గ్రామంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. బియ్యం లేక పస్తులు ఉన్నవాళ్లు ఒక్కరు కూడా లేకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయం అని పేర్కొన్నారు.
ఓటు బలమైన ఆయుధం..
ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం. 40ఏండ్ల పాటు మీరు ఏ పెద్ద మనిషికైతే ఓటు వేశారో.. ఆ పెద్దమనిషి ఎదిగినట్లే ఇక్కడ సమస్యలు కూడా ఎదిగాయి తప్ప ప్రజల జీవితాల్లో వెలుగులు రాలేదని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దు.. ఇన్నేండ్లు నమ్మి మోసపోయింది చాలు.. మళ్లీ మోసపోవద్దు అని మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరి పాలనలో మంచి జరుగుతున్నదో ఆలోచించుకోవాలి. ఎవరి పాలనలో మన బతుకులు బాగుపడుతున్నయో తెలుసుకోవాలి.. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుతామని, ఎన్నికలయ్యాక ప్రజల బాగోగులపై చర్చించడం తమ నైజమని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క ఓటుతో భగత్ ఎమ్మెల్యే కావడంతో పాటు ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పారు. మంత్రి వెంట దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్దన్రెడ్డి, ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, జడ్పీటీసీ సూర్యబాష్యానాయక్ తదితరులున్నారు.
కేసీఆర్ సార్ మంచిగ చేస్తుండు…
మా సొంతూరు గుంటూరు జిల్లా మాచర్ల. బతుకుదెరువు కోసం సాగర్కు వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నా. మూడేండ్ల కిందట యాక్సిడెంట్లో చెయ్యి విరగడం వల్ల కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నా. కేసీఆర్ సారు రూ.3వేలు పింఛన్ ఇస్తున్నడు. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న మేలు నేను ఎన్నటికీ మర్చిపోలేను.
ఏలూరి భాగ్య, పైలాన్ కాలనీ, నందికొండ
ఇవి కూడా చదవండి
ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు షాక్
అక్టోబర్ నాటికి ఇండియాలో మరో ఐదు కరోనా వ్యాక్సిన్లు