అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తుండడంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలయింది. ఇవాళ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట పంచాయతీకి చెందిన సర్వేయర్ నాగేశ్వర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన ఒక రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు.
నిన్న మూడు జిల్లాలో దాడులు నిర్వహించి ముగ్గురు ఉద్యోగులను పట్టుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక తహసీల్దార్, ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం వరగాన పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టా పుస్తకం కోసం బాధితుడి నుంచి రూ. 8వేలు లంచం తీసుకున్న మౌలాలి అనే వీఆర్వోను పట్టుకున్నారు.
అనకాపల్లి జిల్లా ములుగపుడి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టా పాస్ పుస్తకం కోసం వీఆర్వో రూ. 40వేలు డిమాండ్ చేయగా రూ. 20వేలు తీసుకుం టుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. వీఆర్పై కేసు నమోదు చేసినట్లు అధికా రులు తెలిపారు. నెల్లూరు జిల్లా సీతారామాపురం తహసీల్దార్ సతీశ్ రూ. 10వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.