భీమ్గల్: పట్టణ ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ కోరారు. ప్రతి ఆదివారం పట్టణంలో రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 10 గంటల పది నిమిషాలకు పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తొమ్మిది, పదో వార్డుల్లో కాలనీ మహిళలతో కలిసి పిచ్చి మొక్కలతో పాటు నిల్వ ఉన్న నీటిని తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది చేత మురికి కాల్వల్లో ఆయిల్బాల్స్ వేయించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించారు, హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తుమ్మ భూదేవి, శానిటరి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్, మొప్మా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.