సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): పశువులకు గడ్డి వేస్తాం.. పాముకు పాలు పోస్తాం.. సాటి మనిషికి తాగేందుకు నీళ్లివ్వక పోవడం అమానుషం అంటూ ‘కులాల అంతరాలను రూపు మాపేందుకు’ సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమించిన తీరును నాటకం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు ఆహూతులను ఎంతగానో ఆ కట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రవీంద్రభారతిలో ప్రదర్శించిన సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసింది. గోల్కొండ పత్రిక స్థాపన, గోల్కొండ కవుల సంచిక పేరుతో 354 మంది తెలంగా ణ కవుల శ్లోకాలను, పద్యాలను వెలుగులోకి తీసుకురావడం వంటి ఆయన జీవిత కాలంలో సామాజిక స్ఫూర్తి కలిగించిన ముఖ్యమైన అంశాలను ఆధారంగా చేసుకుని రచయిత విజయభాస్కర్ నాటకాన్ని అద్భుతంగా మలిచారు. కథానుగుణంగా ప్రేక్షకులను నటీనటులు తమ నటనతో అలరించారు.
గ్రంథాలయోద్యమకారునిగా, సంస్కరణ శీలిగా, ప లు రంగాల్లో అగ్రగామిగా పనిచేసి తెలుగు జాతికే వన్నె తెచ్చిన సురవరం ప్రతాపరెడ్డి అన్ని తరాల వారికి స్ఫూ ర్తి ప్రదాతగా నిలిచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నాటక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కీర్తిని అన్నిదిశలా విస్తరింపజేసిన సురవరం జీవిత విశేషాలు అన్ని తరాల వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు. కార్యక్రమంలో సినీనటుడు డా॥ రాజేంద్రప్రసాద్, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోర టి వెంకన్న, మాజీఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ పాల్గొన్నారు.