హైదరాబాద్ : ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపు చారిత్రాత్మకమని రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్పై నమ్మకంతో సురభి వాణీదేవికి పట్టం కట్టిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల ప్రచారంలో పసలేదన్న వాదనను పట్టభద్రులు నిజం చేశారని పేర్కొన్నారు. మహిళకు టికెట్ ఇచ్చి గెలుపునకు కృషి చేసి సీఎం కేసీఆర్ మహిళలపై గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ కూతురును ఎమ్మెల్సీగా గెలిపించి చరిత్ర సృష్టించారన్నారు. వాణీదేవి విజయం.. పట్టభద్రులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.