న్యూఢిల్లీ: రేపు బక్రీద్ పండుగ. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడిలించింది. వ్యాపారస్తులకు వెసలుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన పట్ల ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కేరళ ప్రభుత్వ వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. బక్రీద్ పండుగ కోసం కోవిడ్ నిబంధనలను సడలించడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రభుత్వ వైఖరి షాకింగ్కు గురిచేస్తోందని కోర్టు చెప్పింది. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల కొత్తగా ఏవైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే, అలాంటి ఘటనలకు కోర్టు ముందుకు తీసుకువస్తే, అప్పుడు కేరళపై చర్యలు తీసుకుంటామని సుప్రీం వెల్లడించింది. కన్వర్యాత్ర నిర్వహణలో యూపీ ప్రభుత్వానికి ఇచ్చిన తీర్పును పరిశీలించాలని కేరళను సుప్రీంకోర్టు కోరింది.