న్యూఢిల్లీ : రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం పట్ల భారతీయ రైల్వేలను తీవ్రంగా ఆక్షేపించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ తరహా ఘటనతో విమానం మిస్ అయినందుకు ఓ వ్యక్తికి రూ 30,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రైలు ప్రయాణంలో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యం ఎదుర్కొన్న వ్యక్తికి రైలు సకాలంలో గమ్యస్దానానికి ఎందుకు చేరుకోలేదో వివరించలేని పక్షంలో రైల్వేలు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారత రైల్వే నెట్వర్క్ను ఉపయోగించే ప్రయాణీకులకు రైళ్ల రాకపోకల్లో జాప్యం సాధారణ విషయంగా మారిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పోటీతత్వం, జవాబుదారీతనం అవసరమైన ఈ రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్ధ మనగలగి, ప్రైవేట్ సంస్ధలతో పోటీ పడాలంటే సేవలు, పని సంస్కృతిని మెరుగుపరుచుకోవాలని తేల్చిచెప్పింది.
పౌరులు, ప్రయాణీకులు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని వ్యాఖ్యానించింది. ఈ బాధ్యతను రైల్వేలు అంగీకరించాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధా బోస్లతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.