న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మెడికల్ బెయిల్పై బయట ఉన్న ఆయన తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, కాబట్టి పర్మినెంట్ బెయిల్ను మంజూరు చేయాలని తొలుత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తున్నా మని తెలిపింది. మరోవైపు భీమా కోరెగావ్ కేసులో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.