హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రగతికి గులాబీ జెండా అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఉద్యమ పార్టీ ఆవిర్భవించి నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీలోని అన్ని శ్రేణుల కార్యకర్తలు, నాయకులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. కేసీఆర్ ఆమరణ దీక్షతో, ప్రజల మద్దతుతో అనుకున్న తెలంగాణ రాష్ట్ర లక్ష్యం సాకారమైందన్నారు.
ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాదాపు ఏడేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రభాగాన నిలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వినోద్ కుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఓరుగల్లులో గెలుపు టీఆర్ఎస్దే : మంత్రులు
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా