చిక్కడపల్లి: బాణామతి,ఇతర మూఢనమ్మకాలు మానవ హక్కుల సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు.మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నరేంద్ర దబోల్కర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రయ్య ‘తెలంగాణ రాష్ట్ర అమానవీయ,మూఢాచారాల,బాణామతి నిరోధక నిర్మూలన చట్టం 2021’’ ముసాయిదా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకలు ప్రజల నుంచి దూరం చేయాలంటే చట్టాలు అవసరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం అందరూ రాజ్యాంగాన్ని అధ్యాయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కుల నిర్మాలన సంఘం అధ్యక్షుడు సీఎల్ఎన్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోవిజ్ఞాన దర్శిని అధ్యక్షుడు టి.రమేశ్,మానవ వికాస వేదిక కేంద్రం అధ్యక్షుడు బి.సాంబశివరావు పి.అనంతరామయ్య, తుమ్మాభాస్కర్, రాజ్వీర్, బి.రాజేశ్వరి, కందుకూరి విజయ, తులసీరామ్, ఈశ్వరలింగం, వహీద్, జంగయ్య, పృథ్వి, సుదర్శన్, కృష్ణ చైతన్య, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.