హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ను జట్టులోకి తీసుకున్నట్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ బుధవారం వెల్లడించింది.
బయో బబుల్లో తాను ఎక్కువ రోజులు ఉండలేనంటూ మార్ష్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడు. రాయ్ తన ఐపీఎల్ కెరీర్లో కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
2017లో గుజరాత్ లయన్స్తో లీగ్లో అరంగేట్రం చేసిన రాయ్ తర్వాతి సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. వ్యక్తిగత కారణాలతో 2020 సీజన్కు దూరంగా ఉన్న రాయ్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతనిపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. ఇటీవల భారత్తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో రాయ్ 144 రన్స్ సాధించాడు.
వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని, అతని స్థానంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జేసన్ రాయ్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఒప్పందం చేసుకుందని ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.