ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, జూలై 1 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధితులు అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బస్వాపురం రిజర్వాయర్ ముంపునకు గురవుతున్న మండలంలోని లప్పానాయక్తండా వాసులు శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డిని కలిశారు.
దాతరుపల్లి గ్రామం వద్ద పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంపై ప్రభుత్వ విప్తో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముంపు భాదితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పునరావాసంపై జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. లేఅవుట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వవిప్ను కలిసిన వారిలో గ్రామ సర్పంచ్ ధీరావత్ బుజ్జీశంకర్నాయక్, బాలు, బీచ్యానాయక్, మోహన్, బలరాం పాల్గొన్నారు.