హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చింది. రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సునీల్శర్మను ఇంధనశాఖ స్పెషల్ సీఎస్గా బదిలీ చేసింది. ఇప్పటివరకు ఇంధనశాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్కుమార్ సుల్తానియాను రిలీవ్ చేసింది. ప్రస్తుతం పలుశాఖలకు సునీల్శర్మ నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలను అలాగే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడలశాఖ కార్యదర్శిగా ఉన్న కేఎస్ శ్రీనివాసరాజును బదిలీచేసి రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.