ముంబై: స్పిన్నర్ సునీల్ నరైన్ కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో 150 వికెట్లను తీసుకున్న తొలి విదేశీ స్పిన్నర్గా నిలిచాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా ప్లేయర్ నరైన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో 150 కన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అతను 8వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డెయిన్ బ్రావో ఉన్నాడు. అతను 158 మ్యాచుల్లో 181 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 122 మ్యాచ్లు ఆడిన లసిత్ మలింగ మొత్తం 170 వికెట్లు తీసుకున్నాడు. ఇక మూడవ స్థానంలో అమిత్ మిశ్రా ఉన్నాడు. అతను 154 మ్యాచుల్లో 166 వికెట్లు తీశాడు. గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన కోల్కతా ఈ సారి ప్లేఆఫ్కు చేరడం కష్టంగానే ఉంది.