తిరుమల,జూలై : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 24వ తేదీన16వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనున్నది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి సుందరకాండలోని 65 నుండి 68వ సర్గ వరకు 4 సర్గల్లో గల 229 శ్లోకాలను, శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని పారాయణం చేస్తారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులు ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. సుందరకాండలో మొత్తం 68 సర్గల్లో 2,821 శ్లోకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంతో మొత్తం శ్లోకాల పారాయణం పూర్తవుతుంది.