న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కోర్టుకు హాజరుకావాలంటూ ఓ బ్యాంక్ చైర్మన్, రీజినల్ మేనేజర్కు అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజా సేవ నిర్వర్తిస్తున్న అధికారులకు సమన్లు జారీ చేయడం సహేతుకం కాదని పేర్కొంది. అధికారులను కోర్టులకు హాజరుకావాలని ఆదేశించే ఆనవాయితీ తగదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేయడాన్ని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్తో కూడిన బెంచ్ గుర్తుచేసింది.