కరోనా సెకండ్ వేవ్ మొత్తం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, ఎన్ని చర్యలు చేపట్టినా పెద్ద సంఖ్యలో జనం ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం.
కొవిడ్ వంటి వైరస్ల నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఇమ్యూనిటీ మెరుగుపరచుకోవచ్చని సెలవిస్తున్నారు. వేసవి కాలం అయినందున ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. రోజూ ఉదయమే పరగడుపున ఆయుర్వేద పానీయాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
10 బాదాం పప్పులను తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటి పొట్టును తొలగించి.. వీటికి శుభ్రం చేసుకున్న 5 ఖర్జూరాలను కలిపి ఉంచుకోవాలి. ఈ రెండింటిని ఆవు పాలతో కలిపి పసుపు, యాలకుల పొడి, నెయ్యి వేసి బ్లెండర్లో వేసి బాగా తిప్పాలి.ఇలా రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత గ్లాసులోకి తీసుకుని తేనె కలిపి సేవించాలి. బాదాం, ఖర్జూరాలు రెండూ ఇమ్యూనిటీని పెంచే డ్రైఫ్రూట్స్. వీటికి తేనె కలుపడం ద్వారా మరింత శక్తి అందుతుంది.
పసుపు టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలతో పాటు కర్క్యుమిన్ అనే రసాయనిక సమ్మేళనం ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహకరిస్తాయి. నీటిలో అల్లం, పసుపు వేసి మరిగించి కషాయం నిత్యం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీనిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే మరింత రుచికరంగా కూడా ఉండటమే కాకుండా చెడు వ్యాధి కారకాల పెరుగుదలను నివారిస్తుంది.
గ్లాసెడు నీటిలో వాము, నల్ల మిరియాలు, తులసి ఇకులను వేసి బాగా మరిగించాలి. అనంతరం దీనిలో తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉండి అనేక వ్యాధులను నయం చేస్తుంది. వీటిలో ఉంటే యాంటీ ఇనఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే తీవ్రమైన జలుబు, దగ్గుల నుండి ఉపశమనం కలిగించడంతో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ పానీయంలో తులసి ఆకులు, నల్ల మిరియాలు, తేనె కలుపడం వల్ల మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
కప్పు పాలకూర తరుగు, మామిడి లేదా పైనాపిల్ ముక్కలు, బాదం పాలు లేదా పెరుగును తీసుకుని.. అందులో కొంచెం నిమ్మరసం, తాజాగా తురిమిన అల్లం ముక్కలు వేసి గ్రైండింగ్ చేసి పెట్టుకుని వీలు చిక్కినప్పుడల్లా తాగుతూ ఉండాలి. ఒకవైపు రోగనిరోధక శక్తిని అందిస్తూ మరోవైపు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే పానీయాల్లో గ్రీన్ స్మూతీ ఒకటి. దీనిలో ఏ, సీ విటమిన్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంటను తగ్గించడంలో బాగా సహకరిస్తాయి. శరీరానికి చల్లదనాన్ని అందించి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఒక పాన్ లో ఒక కప్పు నీరు, తులసి ఆకులు, లవంగాలు, అల్లం వేసి.. దీన్ని 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. చల్లారక ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేయండి. ఒక కప్పు గిలోయ్ రసంలో ఈ మిశ్రమం ఒక టీ స్పూన్, చిటికెడు నల్ల ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి తాగాలి. ఈ పానీయాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గిలోయ్ రసంలో రక్తంలోని విషాలను తొలగించి శుద్ధి చేస్తుంది. కాలేయ వ్యాధుల నివారణకు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. అల్లం, లవంగాలు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
భారత్ నుంచి వచ్చే పౌరులపై మే 15 నుంచి ఆస్ట్రేలియా నిషేధం ఎత్తివేత
భారత్కు 10 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపిన ఐరాస
మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై దాడి.. పేలుడులో గాయాలు
కాలువలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు.. 671 వయల్స్ స్వాధీనం
టోక్యో ఒలింపిక్స్పై కరోనా పంజా: రద్దు చేయాలంటూ ప్రధానికి విజ్ఞప్తి
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..