అప్పుల బాధ భరించలేని ఒక నిర్ణయం దారుణమైన నిర్ణయం తీసుకుంది. పక్కరాష్ట్రం వెళ్లిన ఈ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం అప్పుల వల్ల ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ వెళ్లిన ఈ కుటుంబం.. శనివారం నాడు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు కారకులైన వారి పేర్లను ప్రస్తావిస్తూ ఆ కుటుంబ సభ్యులు ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు.
సోషల్ మీడియాలో ఈ సూసైడ్ లెటర్ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. వేధింపులకు గురిచేసిన వడ్డీ వ్యాపారులపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆడియో కాల్ రికార్డింగులు సేకరించే పనిలో ఉన్నారు.