న్యూఢిల్లీ : భారత్తో వాణిజ్యం చేయకూడదని నిర్ణయించిన పాకిస్తాన్.. ఇప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఆహార పదార్థాలు ముఖ్యంగా చక్కెర నిల్వలు లేక ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ కిలోకు రూ.110 పలుకుతున్నది. అదే భారత్లో రూ.38-40 గా ఉన్నది. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని ఎత్తివేయడంతో భారత్పై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్.. ఆర్టికల్ 370 ని పునరుద్ధరించేవరకు భారత్తో వాణిజ్యం నెరపకూడదని పెట్టుకున్నది. దాంతో భారత్ నుంచి దిగుమతి చేసుకునే చక్కెర నిలిచిపోవడంతో ధర పెరిగిపోయింది. అదేవిధంగా 40 శాతం మందులకు కూడా భారతదేశంపై ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణ రేటు 12 శాతానికి చేరుకున్నది. రంజాన్ సందర్భంగా పిండి కిలోకు రూ.96 కు పెరిగింది.
పరస్పర వాణిజ్యం విషయంలో భారతదేశం ఎప్పుడూ పైచేయి సాధించింది. 2018-19లో భారతదేశం 550.33 మిలియన్ డాలర్ల విలువైన పత్తిని, 457.75 మిలియన్ డాలర్ల విలువైన సేంద్రియ రసాయనాలను ఎగుమతి చేసింది. ఏప్రిల్ 2020-జనవరి 2021 మధ్య ఎగుమతులు దాదాపు 2 మిలియన్ డాలర్లకు తగ్గాయి. అయితే, ఈ కాలంలో ఔషధ ఎగుమతులు పెరిగాయి. పాకిస్తాన్ 67.26 మిలియన్ డాలర్ల విలువైన మందులను దిగుమతి చేసుకున్నది. ఈ సమయంలో 115 మిలియన్ డాలర్ల విలువైన సేంద్రియ రసాయనాలు కూడా దిగుమతి అయ్యాయి. కాగా, 2018-19లో ఖనిజ ఇంధనాలు, నూనెలు (131.29 మిలియన్ డాలర్లు), పండ్లు, వేరుశనగ (103.27 మిలియన్ డాలర్లు), అలాగే రాక్ సాల్ట్, సల్ఫర్, రాయి, ప్లాస్టరింగ్ పదార్థాలను ( 92.84 మిలియన్ డాలర్లు) పాకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకున్నది.