సుధాకర్, లావణ్య నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘అం అః’. శ్యామ్ దర్శకుడు. ‘ఏ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ ఉపశీర్షిక. శ్రీపద్మ ఫిలిమ్స్ పతాకంపై జోరిగె శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంది. సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్న కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథలో కొత్తదనం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
జూలై చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివారెడ్డి పావనం, సంగీతం: సందీప్ కుమార్ , కథ: నవీన్ ఎరగాని, దర్శకుడు: శ్యామ్ మండల.