బడంగ్పేట: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందించారు. సీఎస్ సి డిపార్టుమెంట్ విద్యార్థిని తేజస్వీని అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల యాజమాన్యం గోల్డ్ మెడల్తోఘనంగా సత్కరించింది. 486 మందికి డిగ్రీ పట్టా సర్టీఫికెట్లను ఎంపి రంజిత్రెడ్డి, టీకేఆర్ కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డితో కలిసి అందజేశారు.
పట్టాలు అందుకున్న తర్వాత విద్యార్థులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప ఇంజనీర్లుగా ఎదగాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక విద్యా విధానంతో ముందుకు సాగాలన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాధించి విదేశాలలో స్థిర పడ్డారని అన్నారు. దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుక రావాలన్నారు. దేశానికి అవసరం అయిన సాంకేతి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.
తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన అన్నారు. నైపుణ్యం గల విద్యార్థులను ప్రొత్సహించడం జరుగుతుందన్నారు. చాలా మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్ సంపాధించుకున్నారని ఆయన అన్నారు. విద్యార్థులను అన్ని విధాలుగా ప్రొత్సహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తీగల హరినాథ్రెడ్డి, కోశాధి కారి తీగల అమర్ నాథ్రెడ్డి,ప్రిన్సిపల్ డివి రవి శంకర్, కేవీ మురళీ, డాక్టర్ సురేష్ రావు, ఏవో నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు.