మేడ్చల్: హైదరబాద్ శివార్లలోని కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్రోడ్ సర్వీస్ రోడ్లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతిచెందిన విద్యార్థిని శేఖర్గా గుర్తించారు. జీడిమెట్లలోని షాపూర్ నుంచి హయత్నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాయపడిన విద్యార్థికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.