అమరావతి: కృష్ణా జిల్లాలోని నూజివీడు ఐటీ కళాశాలలో ఐటీ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఫస్టియర్ చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు విజయనగరం జిల్లా గుర్ల మండలం వాసిగా గుర్తించారు. అయితే విద్యార్థి మృతికి గల కారణాలు తెలియలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.