మనిలా : ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పొందగిటాన్కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల ప్రకంపనలు లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేశాయి. ఆ తర్వాత భారీగా ప్రకంపనలు వచ్చినా నష్టానికి సంబంధించి నివేదికలు అందలేదని పేర్కొంది. పసిఫిక్ రింగ్లో ఉన్న ఫిలిప్పీన్స్ తరచుగా భూకంపాలు ఎదుర్కొంటుంది.