మహబూబ్నగర్ : స్కానింగ్కు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ దవాఖానలను ఏర్పాటు చేసిందని, అంతేకాక అధునాతన పరికరాలతో తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు స్కానింగ్ కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లమనడం మంచిదికాదన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం మంత్రి మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 200 ఆక్సిజన్ పడకల ప్రారంభోత్సవం సందర్భంగా దవాఖానకు వచ్చిన పలువురు మహిళలతో మాట్లాడారు. డాక్టర్లు స్కానింగ్, ఇతర పరీక్షల నిమిత్తం తమను ప్రైవేటు కేంద్రాలకు వెల్లమంటున్నారని మంత్రికి ఫిర్యాదు చేయగా మంత్రి పైవిధంగా స్పందించారు.
దవాఖాన ల్యాబ్ ఇంచార్జి, డాక్టర్లను పిలిపించి మాట్లాడగా.. రేడియాలజిస్ట్ ఒకరే ఉన్నందున గర్భిణిలకు 5వ నెలలో నిర్వహించే టిఫా స్కాన్ కు సమయం తీసుకుంటున్నందున ప్రైవేట్ కేంద్రాలకు రాస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానల్లోనే అన్ని పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒకవేళ ఏదైనా పరీక్షల నిర్వహణకు ఆలస్యం అయ్యేలా ఉంటే రోగులకు తెలియజేయాలని సూచించారు.
మంత్రి వెంట కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ రాంకిషన్, దవాఖాన సలహా కమిటీ సభ్యురాలు లక్ష్మి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్