ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 487.40 పాయింట్ల (1.01శాతం) లాభంతో 48,927.52 వద్ద.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 152.90 పాయింట్లు పెరిగి.. 14,477.80 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ వాణిజ్యంలో 1,036 స్టాక్స్ లాభపడగా.. 222 క్షీణించగా.. 48 స్టాక్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీ, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 48,981.82, నిఫ్టీ 14,499.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.