న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్న రాష్ట్ర యువ జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి చిక్కుల్లో పడింది. తన అనుమతి లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష చేయడంపై భారత క్రీడా ప్రాధికార (సాయ్)కు ఫిర్యాదు చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సాయ్.. ముగ్గురు సభ్యులతో విచారణకు ఆదేశించింది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమాన్ అధ్యక్షత వహించనున్న కమిటీలో కోచ్ కమలేశ్ తివాన, డిప్యూటీ డైరెక్టర్ కైలాశ్ మీనా సభ్యులుగా ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలనలోకి తీసుకుంటూ వచ్చే వారంలో కమిటీ నివేదిక తయారు చేయనుంది. అరుణ ఆరోపిస్తున్న కోచ్ రోహిత్ జైస్వాల్పై ఇప్పటికే సాయ్ నివేదిక అందింది. జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ కోసం ఢిల్లీలోనిర్వహించిన ఫిట్నెస్ టెస్టును వీడియో తీయడం వివాదానికి కారణమైంది.