హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీని తరిమికొట్టి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్రెడ్డి చెప్పారు. శనివారం హిమాయత్నగర్లోని చాంబర్ కార్యాలయంలో రాజు వెన్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా చాంబర్ ఏకగ్రీవ తీర్మానంచేసింది. ఈ సందర్భంగా రాజు వెన్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్లంతా మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటులేదన్నారు.