ములుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల 7వ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలను మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ముందుగా 10 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తొలి రోజు నిర్వహించిన క్రీడల్లో నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, అదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, ములుగు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.
కాగా, బుధవారం కూడా ఈ క్రీడలు నిర్వహించి రాష్ట్ర స్థాయికి జట్లను ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్సురభి, ఏఎస్పీ సాయిచైతన్య, సెపక్తక్రా అసోసియేషన్ నాయకులు ప్రేమ్రాజ్ గోవింద్నాయక్, బానోత్ సమ్మయ్య, శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, శిరీష్రెడ్డి, జితేందర్నాథ్, రామకృష్ణ, అనిల్కుమార్, పీవీ చారితోపాటు కోచ్లు పాల్గొన్నారు.