మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most eligible bachelor) తర్వాత అఖిల్ సినిమాలపై అంచనాలు పెరిగాయి. అక్కినేని హీరోలకు రొమాంటిక్ ముద్ర వద్దన్నా వస్తుంది..అందుకే మాస్ హీరోగా ఎదగాలని ముందు నుంచి ప్రయత్నిస్తున్నాడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni). ఈ క్రమంలోనే మొదటి సినిమాతోనే మాస్ ప్రయత్నం చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. ఆ తర్వాత వంశపారంపర్యంగా వస్తున్న రొమాంటిక్ వైపు అడుగులు వేశాడు. ఈ ప్రయత్నంలో కూడా రెండుసార్లు దెబ్బతిని మూడోసారి విజయం సాధించాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అవడంతో ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఏజెంట్ (Agent). సినిమాపై పెట్టాడు అఖిల్.
ఈ సినిమాతో కచ్చితంగా యాక్షన్ హీరోగా ఇమేజ్ సంపాదించుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే 8 ప్యాక్ చేయడమే కాకుండా యాక్షన్ సన్నివేశాలు కూడా ఇరగదీస్తున్నాడు అక్కినేని వారసుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు అఖిల్ దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బడ్జెట్ కూడా 40 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ తో సంబంధం లేకుండా కథను నమ్మి ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన పాత్ర కూడా సినిమాకు కీలకంగా మారనుంది. అంతే కాదు అఖిల్ తో సమానంగా మమ్ముట్టి (Mammootty) రెమ్యునరేషన్ తీసుకోనుండటం టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చకు తెర తీస్తోంది. ఏజెంట్ సినిమాలో నటించడానికి కూడా అక్షరాలా 5 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి (Surenderreddy) కూడా ఈ సినిమాకు భారీ పారితోషికం అందుకుంటున్నాడు.
సైరా తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. వక్కంతం వంశీ ఏజెంట్ సినిమాకు కథ అందిస్తున్నాడు. కేవలం రెమ్యునరేషన్ కోసమే దాదాపు 20 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కమర్షియల్ యాడ్స్ లో నటించే సాక్షి వైద్య (Sakshi vaidya)హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇదే ఏడాది ఏజెంట్ విడుదల కానుంది.