కోల్కతా : టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్(ssc scam) లో అరెస్ట్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే, బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ మాణిక్ భట్టాచార్య కార్యాలయంలో శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 11న మాణిక్ భట్టాచార్యను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ప్రైమరీ టీచర్స్ నియామకాల కుంభంకోణం ఆరోపణలపై ఈ నెల 10న మాణిక్ భట్టాచార్యను ఈడీని ప్రశ్నించింది.
విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనను 14 రోజుల కస్టడీకి పంపింది. ఈ కేసులో సెప్టెంబర్ 27న టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ విచారణకు పిలిచింది. ఆయన విచారణకు హాజరుకాలేదు. సీబీఐ సమన్లపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి.. అరెస్టు నుంచి మినహాయింపు పొందారు. అయితే, తాజాగా ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. గతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పటి పశ్చిమ బెంగాల్ పరిశ్రమల మంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని సైతం అరెస్టు చేసిన విషయం విధితమే.