నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం 4గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 12,500 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేసినట్లు ఏఈఈ అక్తర్ తెలిపారు.
ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 21,400 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉందని ఏఈఈ తెలిపారు.