నాగర్కర్నూల్ : తెలంగాణలో ప్రజా శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడం హర్షణీయమని శ్రీశైలం దేవస్థాన స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్న కేసీఆర్కు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ ప్రజాదరణ పొందిన ఉత్తమ నాయకుడికి అన్ని రాష్ర్టాల ప్రజల మద్దతు లభించి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించగలిగే సర్వోన్నత పదవికి పట్టం కట్టాలి. ఇందుకోసం శ్రీశైలం క్షేత్రంలోని ఆదిదంపతులకు ప్రత్యేక పూజలు కూడా చేశామన్నారు. ప్రపంచ దేశాలు సైతం తెలంగాణ వైపు మొగ్గు చూపిన విధంగా భావితరాల బంగారు భవిష్యత్కు కేసీఆర్ దేశ రాజకీయాల్లో రారాజులా రాణించాలని ఆకాంక్షిస్తున్నానని పూర్ణానంద ఆరాధ్యులు పేర్కొన్నారు.