శ్రీశైలం: కృష్ణానదీ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో తెల్లవారుజాము నుంచి కాస్త పెరిగింది. దీంతో సోమవారం ఉదయం నుంచి డ్యాం పది గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు నుంచి 68,050, విద్యుదుత్పత్తి ద్వారా 39,092, సుంకేశుల నుంచి 90,222, హంద్రీ నుంచి 4,905 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదలైంది.
సాయంత్రం వరకు 3,88,090 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే, పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తులో తెరిచి 3,75,680, కుడి ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 62,914 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.20 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.80 టీఏంసీలకుగానూ 210.99 టీఏంసీలుగా నమోదైంది.